Parvathipuram Manyam జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

by Disha Web Desk 16 |
Parvathipuram Manyam జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురంమన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆటో ప్రయాణికులు ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు స్థానికులు చెబుతున్నారు.



Next Story

Most Viewed