Anakapalli: సౌత్ ఏషియన్ ఒలింపిక్స్ స్కోరర్‌గా అనకాపల్లి వాసి

by Disha Web Desk 16 |
Anakapalli: సౌత్ ఏషియన్ ఒలింపిక్స్ స్కోరర్‌గా అనకాపల్లి వాసి
X

దిశ, అనకాపల్లి: అనకాపల్లికి చెందిన క్రికెటర్ కేఎస్పీవీపీ వేణు మాధవ్ సౌత్ ఏషియన్ ఒలింపిక్స్ క్రికెట్ మ్యాచ్‌ల స్కోరర్‌గా ఎంపికయ్యారు. సింగపూర్ నుంచి ఎంపికైన ఈయన అనకాపల్లికి చెందిన వ్యక్తి కావడంతో తన తోటి క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో చాలా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతూ క్రికెట్ అభివృద్ధికి సేవలు అందించారు. గుడ్ ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్, శారదా క్రికెట్ క్లబ్ పేరిట సొంత డబ్బులు వెచ్చించి చాలా మంది క్రికెటర్లకు సహాయపడినట్లు పేర్కొన్నారు. గత 28 ఏళ్లుగా క్రికెట్‌కు వేణు మాధవ్ విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. కేఎస్పీవీపీ వేణు మాధవ్‌కు ఈ సందర్భంగా ఉగ్గిన రాజు, ఉగ్గిన శ్రీను, నాగార్జున, అజ్జు, హరి, శ్రీకాంత్ తదితరులు అభినందించారు.


Next Story

Most Viewed