- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap Cpi: ఉద్యోగులపై ఎక్కువైన రాజకీయ పెత్తనం
ఉద్యోగులపై జగన్ సర్కార్ రాజకీయ పెత్తనాన్ని నిరసిస్తూ అనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద సీపీఐ ధర్నాకు దిగింది....

X
దిశ, అనకాపల్లి: ఉద్యోగులపై జగన్ సర్కార్ రాజకీయ పెత్తనాన్ని నిరసిస్తూ అనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద సీపీఐ ధర్నాకు దిగింది. సీపీఎస్ను రద్దు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనకాపల్లి సీపీఐజిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. టీచర్ల విషయంలో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వోద్యోగులను వేధించడం తగదని సూచించారు. టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పడం అన్యాయమన్నారు. వలంటీర్లను ఎన్నికల ప్రచారానికి ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు. సీఎం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులను వేధించడం మానుకోవాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Next Story






