నాగులపల్లిలో విషాదం.. చెరువులో యువకుల మృతి

by Disha Web Desk 16 |
నాగులపల్లిలో విషాదం.. చెరువులో యువకుల మృతి
X

దిశ, మునగపాక: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వేసవి వేడిమి తాళలేక చెరువులోకి దిగి సేద తీరుతుండగా గల్లంతయ్యారు. చెరువులో ఈత కొడుతుండగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో లోతు పెరిగింది. దాంతో ఒక్కసారిగా ఇద్దరు స్నేహితులు ఈదలేకపోయారు. నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఈ క్రమంలో మృత్యువాత పడ్డారు. నాగులపల్లి గ్రామానికి చెందిన కర్రి సంపత్, పొలమరశెట్టి భాను ప్రకాష్ ఇటీవల పదవ తరగతి పరీక్షలు రాశారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో స్నానానికని సమీపంలో ఉన్న గుడారే ఆనకట్ట వద్దకు సైకిల్‌పై వెళ్లారు. అక్కడ స్నానం చేస్తూ మృతి చెందారు. ఇటీవల పరీక్షలు రాసిన ఈ యువకులు ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed