విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-10 12:33:01  IST  )

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జామి మండలం జన్నీ వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి..

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. జామి మండలం జన్నీ వద్ద ఆటో(Auto)ను లారీ(Lorry) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి లారీ అతివేగమే కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అతి వేగం ప్రమాదకరమని, ప్రతి వాహనదారుడు రోడ్ సేఫ్టీని పాటించాలని చెప్పారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story