వ్యూహం మూవీలో ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసే సీన్.. మరో సంచలన విషయం బయటపెట్టిన ఆర్జీవీ..!

by Disha Web Desk 19 |
వ్యూహం మూవీలో ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసే సీన్.. మరో సంచలన విషయం బయటపెట్టిన ఆర్జీవీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యూహం సినిమాతో ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్‌ను రివీల్ చేశాడు. తాజాగా ఓ టీవీ చానెల్ డిబేట్‌లో పాల్గొన్న ఆర్జీవీ ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకా మర్డర్ అంశం కూడా తన లేటేస్ట్ చిత్రం వ్యూహంలో ఉందని క్లారిటీ ఇచ్చాడు.

ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్య జరిగన తర్వాత నుండి జగన్ ఏపీ సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాలను చూపిస్తోన్న ఈ సినిమాలో.. వైఎస్ వివేకా మర్డర్ అంశం, షర్మిల పాత్ర గురించి కూడా ఉందని తెలిపారు. ఇక, తాను, మా మదర్ ఇద్దరం పవన్‌కు ఫ్యాన్స్ అని.. ఒకప్పుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని కూడా పొగిడానని చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ నిలకడ లేని రాజకీయం చూసి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాని క్లారిటీ ఇచ్చారు. ఇక, వ్యూహం సినిమా తనకున్న సోర్స్ ద్వారా తీస్తున్నట్లు ఆర్జీవీ స్పష్టం చేశారు.

కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు ఆంధ్రప్రదేశ్‌లో పెను దూమరం రేపిన సంగతి తెలిసిందే. మాజీమంత్రి వివేకాను దారుణంగా హత్య చేసిన ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. అయితే, వివేకా మర్డర్‌ జరిగి దాదాపు ఐదేండ్లు కావస్తున్న ఇప్పటికీ ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపికే. ఈ హత్య వెనుక వివేకా నంద ఫ్యామిలీ మెంబర్స్ హస్తం ఉందని టీడీపీ.. మాజీ మంత్రి హత్య వెనక టీడీపీ నేతల హస్తముందని వైసీపీ.. ఇలా ఇరు పార్టీలు ఇప్పటికీ ఆరోపణలు గుప్పించుకుంటాయి.

దీంతో వివేకా మర్డర్ అంశం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ చర్చనీయాంశమే. ఇలాంటి సీరియస్ ఘటనను ఆర్జీవీ తన సినిమాలో చూపిస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంత సెన్స్‌టీవ్ అంశాన్ని వ్యూహం సినిమాలో ఆర్జీవీ ఎలా చూపిస్తాడు.. ఈ ఘటన వెనక ఎవరి హస్తం ఉంది. ఎవరినీ టార్గెట్ చేస్తారు అన్న అంశంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed