గిన్నిస్ పుటల్లోకి విశాఖ ‘యోగాంధ్ర’.. ఏకంగా 3.20 లక్షల మంది హాజరు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-21 06:23:08  IST  )

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది.

గిన్నిస్ పుటల్లోకి విశాఖ ‘యోగాంధ్ర’.. ఏకంగా 3.20 లక్షల మంది హాజరు
X

దిశ, వెబ్‌డెస్క్: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 3.20 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. దీంతో యోగాంధ్ర సరికొత్త వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేసి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. 2023లో సూరత్‌లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. రామకృష్ణ బీచ్‌ నుంచి భీమిలి వరకు 3.20 లక్షల మది ఒకే స్ట్రేచ్‌లో యోగాసనాలు వేసి రికార్డును తిరగరాశారు. ఈ మేరకు గిన్నిస్ రికార్డ్ ప్రతినిధులు ధృవపత్రాలను మంత్రి నారా లోకేశ్, సీఎస్ విజయానంద్‌లకు అందజేశారు.

Next Story