- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
92 రోజుల్లో 7 అగ్నిపర్వత శిఖరాల అధిరోహణ: గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టిన విశాఖ వాసి ‘అన్మిష్ వర్మ’
ప్రపంచంలోనే పర్వతారోహణ రంగంలో ఏపీకి చెందిన వ్యక్తి సరికొత్త చరిత్ర సృష్టించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే పర్వతారోహణ రంగంలో ఏపీకి చెందిన వ్యక్తి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోనే అత్యంత వేగంగా 'సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్' (ఏడు ఖండాల్లోని ఎత్తైన అగ్ని పర్వత శిఖరాలు) అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. అన్మిష్ వర్మ ఈ సాహసయాత్రను కేవలం 92 రోజుల 4 గంటల 45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసి ఈ మైలురాయిని చేరుకున్నారని గిన్నిస్ వరల్డ్ తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
ప్రస్థానం సాగిందిలా..
అన్మిష్ వర్మ తన రికార్డు స్థాయి యాత్రను 2024 అక్టోబర్ 23న రష్యాలోని ‘మౌంట్ ఎల్బ్రస్’ అధిరోహణతో ప్రారంభించారు. వరుసగా ఏడు ఖండాల్లోని అగ్ని పర్వత శిఖరాలను జయిస్తూ, చివరగా 2025 జనవరి 23న అంటార్కిటికాలోని ‘మౌంట్ సిడ్లీ’ శిఖరాన్ని చేరుకోవడంతో ఈ యాత్ర విజయవంతంగా ముగిసింది.
అధికారిక గుర్తింపు
అన్మిష్ వర్మ నెలకొల్పిన ఈ ప్రపంచ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ 2026 ఫిబ్రవరి 6న ధృవీకరించగా, ఫిబ్రవరి 27న అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేసింది. ఒక భారతీయుడు, అందులోనూ విశాఖ వాసి అంతర్జాతీయ స్థాయిలో ఈ రికార్డు సాధించడం పట్ల పర్వతారోహక సంఘాలు , క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అన్మిష్ వర్మ అధిరోహించిన ఏడు అగ్ని పర్వత శిఖరాలు ఇవే..
మౌంట్ ఎల్బ్రస్ (రష్యా - ఐరోపా)
మౌంట్ కిలిమంజారో (టాంజానియా - ఆఫ్రికా)
ఓజోస్ డెల్ సలాడో (చిలీ/అర్జెంటీనా - దక్షిణ అమెరికా)
పికో డి ఒరిజాబా (మెక్సికో - ఉత్తర అమెరికా)
మౌంట్ గిలువే (పాపువా న్యూ గినియా - ఓషియానియా)
మౌంట్ దమవంద్ (ఇరాన్ - ఆసియా)
మౌంట్ సిడ్లీ (అంటార్కిటికా)






