గుండె పోటుతో ఏఎస్ఐ మృతి

by Disha Web Desk 16 |
గుండె పోటుతో ఏఎస్ఐ మృతి
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ ఎయిర్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ వాసుదేవ రావు గుండె పోటుతో మృతి చెందారు, షీలానగర్ ప్రాంతానికి చెందిన వాసుదేవరావు 1983 పోలీసు శాఖలో చేరారు. నాటి నుండి చాలా పోలీసు స్టేషన్‌లతో విధులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం ఎయిర్ పోలీసు స్టేషన్‌లో ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా షీలానగర్ ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. విధినిర్వహణలో అంకిత భావంతో పని చేసే వారని సిబ్బంది ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు విషయం తెలుసుకున్న వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ అన్నెపు నర్సింహా మూర్తి, ఎయిర్ పోలీసు స్టేషన్ సీఐబీ ఎండీ ప్రసాద్‌తో పాటుగా సిబ్బంది వాసుదేవరావు నివాసం వద్దకి వెళ్లి అంజలి ఘటించారు

Next Story

Most Viewed