Ap News: అమిత్ షా సభ ఏర్పాట్లు పరిశీలించిన సోము వీర్రాజు

by Disha Web Desk 16 |
Ap News: అమిత్ షా సభ ఏర్పాట్లు పరిశీలించిన సోము వీర్రాజు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నెల 8న విశాఖపట్నంలో అమిత్ షా పర్యటించనున్నారు. విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖపట్నంలో పర్యటించారు. మర్రిపాలెం సమీపంలోని శారదా బెకరీ గ్రౌండ్‌ను సోము వీర్రాజు నేతృత్వంలోని నేతలు పరిశీలించారు. సోము వీర్రాజు వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, కాశీ విశ్వనాథ్ రాజు తదితరులు ఉన్నారు.


ఇకపోతే ఏపీలో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమిత్ షా విశాఖ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. బహిరంగ సభలో పొత్తులపై ఏదైనా ప్రకటన చేస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.



Next Story