ప్రజల మెడకు ఉరితాళ్లు వేయడమే ప్రభుత్వ లక్ష్యమా.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

by Dishafeatures2 |
ప్రజల మెడకు ఉరితాళ్లు వేయడమే ప్రభుత్వ లక్ష్యమా.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
X

దిశ, ఉత్తరాంధ్ర: అప్రకటిత పవర్ కట్లు విద్యుత్ చార్జీల బాదుడుతో వినియోగ దారులు బెంబేలెత్తిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజక వర్గం పరిశీలకులు గంటా నూకరాజు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపుమేరకు భీమిలి జోన్లో ఉన్న 1,2,3,4 వార్డులు, అలాగే భీమిలి మండలం తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో కృష్ణాకోలనీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా గంటా నూకరాజు మాట్లాడుతూ.. సామాన్య ప్రజల నడ్డివిరచడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఎన్నడూ లేనివిధంగా కరెంటు చార్జీలు పెరిగాయని విని యోగదారులపై 57 వేల కోట్ల రూపాయలు బాదుడుకి శ్రీకారం చుట్టిన ఘనత జగన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. ఇన్ని రకాలుగా ప్రజలను వేదిస్తున్నా ఇంకా సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పు కుంటుందని ఎద్దేవా చేసారు.

నిత్యా వసర వస్తువుల ధరలు ఒకపక్క, విద్యుత్,గ్యాస్ ధరలు మరోపక్క, సామాన్య ప్రజల వేధింపులు ఇంకో పక్కతో ప్రజలు విలవిలలాడుతుంటే మా నమ్మకం నువ్వే జగన్ అన డానికి సిగ్గులేదా? అని గంటా నూకరాజు ప్రశ్నించారు. ఒకసారి తరపాలు లేకుండా ప్రజలమధ్యకు వస్తే ప్రజల కష్టాలు తెలిసి ఉండేవని అన్నారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగురైతు సంఘం ప్రధాన కార్యదర్శి డి.ఎ.ఎన్.రాజు మాట్లాడుతూ వ్యవసాయ మోటర్ల కు విద్యుత్ డిజిటల్ మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాడ్లు వేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎన్నడూ ఏ రైతు అను భవించలేదని అన్నారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్ర రైతులకని మండిపడ్డారు.

నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వరు నాన్యమైన విత్తనాలు ఇవ్వరు ఇదీ కాకుండా పర్యటనలకు వెళ్లిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు రైతులపై సిటార్లు వేస్తారనన్నారు. ఒకటవ వార్డు అధ్యక్షులు తమ్మిన సూరిబాబు మాట్లాడుతూ సిబిఐ కేసులు బాబాయ్ హత్య కేసులు తప్ప ఈ ముఖ్యమంత్రికి ప్రజల గోడు వినబడదని అన్నారు. కరెంటే సరీగా ఇవ్వని ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడంలో మాత్రం ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు ఉందని అన్నారు. 2వ వార్డు నాయకులు చోడిపల్లి సాయి మాట్లాడుతూ.. వేలకోట్ల రూపాయలు బకాయి మోపిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే చెల్లిందని అన్నారు. 4వ వార్డు అధ్యక్షులు పాసి నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత నవ్యంధ్రప్రదేశ్ కి ముఖ్య మంత్రిగా నారాచంద్రబాబు నాయుడు పదవిని చేపట్టిన తరువాత 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ప్రజలకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా చూశా రని అన్నారు.

మాజీ జెడ్పిటిసి శరగడ అప్పారావు మాట్లాడుతూ రైతుల కన్నీరుకు కారణమైన ఇలాంటి నీచమైన ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పో యిందని అన్నారు ఈ కార్యక్రమం లో గజ్జి రాజు,గరికిన కింగ్,కారి అప్పారావు,వాసుపల్లి పోలమ్మ, కోరాడ రమణ,పతివాడ రాంబాబు, గొలగాని నరేంద్ర కుమార్,కనకల అప్పలనాయుడు,మారోజు సంజీవ కుమార్,కొక్కిరి అప్పన్న,వాడ మొదలు సత్యారావు,కంచెర్ల కామేష్,గండిబోయిన పోలిరాజు, బోని రమణ,సూరాడ అమర్ నాద్, సింగంపల్లి అమ్మోరు,కంభపు శివ, తమ్మిన రాము,వియ్యపు పోతు రాజు,పిల్లా తాతారావు,తెడ్డు సింహాద్రి,వాడమొదలు తవుడయ్య, మట్టా దాసు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed