Graduate Mlc Elections : భారీ అధిక్యంలో టీడీపీ

by Disha Web Desk 16 |
Graduate Mlc Elections : భారీ అధిక్యంలో టీడీపీ
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ దూసుకుపోతోంది. ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఈ కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థికి భారీగా ఓట్లు పోల్ అయ్యాయి. తొలి రౌండ్ నుంచే అధిక్యంలో కొనసాగారు. మొత్తం 7 రౌండ్లు పూర్తి అయ్యే సరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి 26,358 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి 80,762 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 54, 404 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి రామాప్రభకు 33,464, బీజేపీ అభ్యర్థి మాదవ్‌కు 8,988 ఓట్లు వచ్చాయి. మొత్తం లెక్కింపు 8 రౌండ్లు కాగా ఇప్పటి వరకూ 7 రౌండ్లు పూర్తి అయ్యింది. చివరి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే మొదటి ప్రాధాన్యతలో మేజిక్ ఫిగర్‌ను ఎవరు అందుకోలేదు.. రెండో ప్రాధాన్యతలో ఏం జరుగుతుందో చూడాలి.


Next Story

Most Viewed