Visakha: శారదాపీఠంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి

by Disha Web Desk 16 |
Visakha: శారదాపీఠంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి
X

దిశ, ఉత్తరాంధ్ర: తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే నెల 3న తాండూరులో తలపెడుతున్న రాజశ్యామల యాగం నిర్విఘ్నంగా సాగేలా దీవించాలని స్వరూపానందేంద్ర స్వామిని కోరారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కూడా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. 21న చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేష్ బయలుదేరుతున్న నేపథ్యంలోస్వరూపానందేంద్ర స్వామి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.


Next Story

Most Viewed