- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖపట్నం > Nimmalapalem: యదేచ్ఛగా అధికార దుర్వినియోగం.. అక్రమంగా చెరువు మట్టి తవ్వకాలు
Nimmalapalem: యదేచ్ఛగా అధికార దుర్వినియోగం.. అక్రమంగా చెరువు మట్టి తవ్వకాలు
by Disha Web Desk 16 |
X
దిశ, కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నిమ్మలపాలెం చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నిమ్మలపాలెం సర్పంచ్ కొట్యాడ శ్రీను తన వ్యక్తిగత అవసరాల కోసం జేసీబీ, ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఇదే విషయమై సదరు సర్పంచ్ను వివరణ అడగగా తన వ్యక్తిగత అవసరాల కోసం గ్రావెల్ తవ్వుతున్నానని.. ఇందుకు రెవెన్యూ అధికారులు అనుమతి ఉందని చెబుతున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం సర్పంచ్కు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అనుమతులు తమ పరిధిలోనివి కాదని ఇరిగేషన్ శాఖ, మైనింగ్ శాఖ పరిధిలోకి వస్తాయని చెప్పారు. గ్రావెల్ తరలింపుపై గ్రామ రెవెన్యూ అధికారితో విచారణ చేస్తామన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన ప్రజా ప్రతినిథే ఇటువంటి చర్యలకు పూనుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Next Story