ఉత్తరాంధ్ర భద్రాద్రిని దర్శించుకున్న నాగబాబు

by Vemula.Srinu Prasad |

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామిని నాగ ఎమ్మెల్సీ నాగబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ..

ఉత్తరాంధ్ర భద్రాద్రిని దర్శించుకున్న నాగబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామిని నాగ ఎమ్మెల్సీ నాగబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నీలాచలం కొండ చుట్టూ నూతనంగా నిర్మించిన గిరిప్రదక్షిణ మార్గం తన పర్యటనలో ప్రత్యేకంగా ఆకట్టుకుందని తెలిపారు. . గతంలో రాళ్లు, ముళ్లతో భక్తులు ఎంతో కష్టపడి ప్రదక్షిణలు చేసేవారని గుర్తు చేవారు. భక్తుల కష్టాలను గుర్తించి, రూ. 3.40 కోట్ల నిధులతో ఈ 3.70 కి.మీల సుందరమైన బీటీ రోడ్డును మంజూరు చేసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామాయణ, మహాభారత కాలాల నాటి చారిత్రక ఆనవాళ్లు ఉన్న ఈ దివ్యక్షేత్రం, రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా (Spiritual Tourism Destination) మారుతుందని నాగబాబు తెలిపారు.

నాగబాబు ట్వీట్..

Next Story