డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రూప్-2 మోడల్ పరీక్ష

by Disha Web Desk 18 |
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రూప్-2 మోడల్ పరీక్ష
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అల్లూరి విజ్ఞాన కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) విశాఖ జిల్లా కమిటీ గురువారం గ్రూప్ 2 మోడల్ పరీక్ష నిర్వహించింది. పరీక్ష పేపర్ ను అల్లూరి విజ్ఞాన కేంద్రం బాధ్యులు పద్మనాభ రాజు ప్రారంభించారు. యువజన సంఘం మాజీ నాయకులు ఎస్.పుణ్యవతి మోడల్ పరీక్ష విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పుణ్యవతి గారు మాట్లాడుతు.. యువజన సంఘం ఈ విధంగా పరీక్ష నిర్వహించిన అభినందనీయమని అన్నారు. అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాన పరీక్షలో అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా డీవైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు రాజు, సంతోష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ నిరుద్యోగుల సమస్యల పైన నిరంతరం పోరాడుతుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించి సాధించిందని తెలిపారు. ఉద్యమాలే కాకుండా అభ్యర్థులకు సహాయ పడాలన్న ఉద్దేశంతో గ్రూప్ 2 మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడల్ పరీక్షకు జిల్లా నాయకులు కోటి, అక్బర్ నాయకత్వం వహించారు. పలువురు గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు.


Read More..

గ్రూప్-2 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్



Next Story

Most Viewed