visakha: బాలికపై అత్యాచారం..స్వామీజీకి రిమాండ్

by Disha Web Desk 16 |
visakha: బాలికపై అత్యాచారం..స్వామీజీకి రిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలికపై అత్యాచారం కేసులో జ్ఞానానంద ఆశ్రమం నిర్వాహకుడు పూర్ణానంద స్వామికి కోర్టు రిమాండ్ విధించింది. జూలై 5 వరకు రిమాండ్ విధించిన కోర్టు తెలిపింది. దీంతో పూర్ణానంద స్వామిని విశాఖ సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.

కాగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలిక వెంకోజీపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న పూర్ణానంద స్వామి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పూర్ణానందను అరెస్ట్ చేశారు. పూర్ణానంద స్వామిని ఎంవీపీ పోలీసులు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో విశాఖపట్నం ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు న్యాయమూర్తి పద్మావతి జ్ఞానానంద స్వామికి వచ్చే నెల 5 వరకు రిమాండ్ విధించారు.

ఇవి కూడా చదవండి :: ఆశ్రమంలో బాలిక లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్

Next Story

Most Viewed