Visakha: ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్

by Disha Web Desk 16 |
Visakha: ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పర్యటిస్తున్నారు. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్, బీచ్ క్లీనింగ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు. కాసేపట్లో విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు. పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లలో ఫార్మా కంపెనీలను ప్రారంభించనున్నారు. ఈ కంపెనీల ఏర్పాటుతో ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

కాగా దసరాకు సీఎం జగన్ అమరావతి నుంచి విశాఖకు ఫిష్ట్ అవుతారని ఇప్పటికే మంత్రులు స్పష్టం చేశారు. అటు సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం విశాఖకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖలో ఆయన ఉండే నివాసం, ఆఫీసు ఒకే చోట ఉండేలా రుషికొండలో భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భవన నిర్మాణాలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. దసరాకు సీఎం జగన్ అధికారికంగా విశాఖ నుంచి పరిపాలన చేయనున్నట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు.



Next Story

Most Viewed