- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖలో ( Visakapatnam) ప్రేమోన్మాది ఘాతుకం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu

దిశ వెబ్ డెస్క్: విశాఖలో ( Visakapatnam) ప్రేమోన్మాది ఘాతుకం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ సంఘటనలో యువతి తీవ్ర గాయాల పాలు కాగా.. ఆమె తల్లి మరణించినట్లు సమాచారం అందుతోంది.
అయితే.. ప్రియురాలి కుటుంబంపై దాడి చేసిన నవీన్ ( Naveen)... అక్కడి నుంచి పారిపోయాడు. శ్రీకాకుళంలో ( Srikakulam) నవీన్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ద్వారా.... అతన్ని ట్రెజ్ చేశారు పోలీసులు. అనంతరం అతన్ని పట్టుకున్న పోలీసులు... విచారణ చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సంఘటనలో యువతి తల్లి నక్క లక్ష్మీ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని వెల్లడించారు. బాధిత యువతికి... మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై హోంమంత్రి అనిత (Anitha) కూడా స్పందించారు. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు అనిత. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూస్తామని పేర్కొన్నారు.
ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి.. పరారీలో నిందితుడు నవీన్
— BIG TV Breaking News (@bigtvtelugu) April 2, 2025
ప్రేమించిన దీపిక గొంతును కత్తితో కోసిన ప్రేమోన్మాది
శ్రీకాకుళంలో నవీన్ సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేస్తున్న పోలీసులు
నవీన్ను పట్టుకోవడానికి శ్రీకాకుళం వెళ్లిన ఓ బృందం
ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న… https://t.co/JtKFPXjJSL pic.twitter.com/zHoeelGGOV






