ముస్లింలకు అండ తెలుగుదేశం జెండా:మహమ్మద్ నజీర్

by Disha Web Desk 18 |
ముస్లింలకు అండ తెలుగుదేశం జెండా:మహమ్మద్ నజీర్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:ముస్లింలకు రాజకీయంగా,సామాజికంగా,ఆర్ధికంగా అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఉద్ఘాటించారు. బుధవారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు అన్నివిధలా గౌరవించి మొదటిసారిగా ఉన్నత పదవులిచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు.హైదరాబాద్ లో బషీరుద్దీన్ బాబూఖాన్ వంటి కోటీశ్వరుడుని కూడా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని మొదటిసారిగా రాజకీయ గుర్తింపునిచ్చి మంత్రిప్రదవిలో కూర్చొబెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులుగా సజ్జల రామకృష్ణ రెడ్డి,విజయసాయిరెడ్డి వంటి వారు ఉంటే, ముస్లిం మైనారిటీ కి చెందిన తనను చంద్రబాబు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చుండబెట్టి కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. ముస్లింలకు రాజకీయంగా,సామాజికంగా,ఆర్ధికంగా అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఉద్ఘాటించారు.మాజిక న్యాయానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అన్నారు .

Read More..

ఉండి టీడీపీలో ముసలం.. 20 ఏళ్ల సేవకు గుడ్ బై..!

Next Story

Most Viewed