విశాఖలో శివ స్వాములకు అవమానం.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

మాలలు విరమించేందుకు వెళ్లిన శివస్వాములకు విశాఖ అప్పికొండ శివాలయం తలుపువేసి ఉండటంతో ధర్నాకు దిగి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు...

విశాఖలో శివ స్వాములకు అవమానం.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ అప్పికొండ శివాలయం(Visakhapatnam Appikonda Shiva Temple)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాలలు తీసేందుకు వెళ్లిన శివ స్వాముల(Shiva Swamulu)కు అవమానం జరిగింది. 41 రోజుల పాటు శ్రద్ధగా దీక్ష చేసిన శివస్వాములు తాజాగా అప్పికొండ దేవాలయంలో మాలలు తీయడానికి వెళ్లారు. అయితే ఆలయానికి అధికారులు తాళాలు వేశారు. దీంతో శివస్వాములు ఆందోళనకు దిగారు. అయితే శివస్వాములను అధికారులు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో శివ స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచారం ప్రకారం పూజలు చేసుకోనివ్వడం లేదని, దేవాదాయ, పోలీస్ శాఖ సిబ్బంది దుర్మార్గంగా వ్యవహారించిందని మండిపడ్డారు. ఏ అధికారి పర్యావేక్షణ చేస్తున్నారో కూడా తెలియడంలేదని శివ స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story