వైసీపీ నేతల అండతోనే మహిళలపై అకృత్యాలు: నారా లోకేష్

by Web Desk |
వైసీపీ నేతల అండతోనే మహిళలపై అకృత్యాలు: నారా లోకేష్
X

దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు ఆడబిడ్డలపై ఆకృత్యాలకు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ట్విటర్ వేదికగా నిలదీశారు. మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ పాలనను నిరసిస్తూ ఈనెల 31న టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరగబోతున్న 'నారీ సంకల్ప దీక్ష కు తన సంపూర్థ మద్దతు తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. 'అక్కా, చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందంటూ కురిపించిన ప్రేమ, ఆప్యాయత ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి గారు? మీ పాలనలో బాగుండటం దేవుడెరుగు..బతికి వుండటమే అదృష్టంగా భావించే దురదృష్ట రోజులు దాపురించాయి.

పట్టపగలు రోడ్డున మహిళలు నడవలేని దుస్థితి. రోజుకో దుర్మార్గుడు, వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలకు మద్యపాన నిషేధం వరం ఇస్తున్నానన్న మీరే ప్రాణాంతక సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కాచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తున్నారు. మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనని నిరసిస్తూ జనవరి 31 న టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు మహిళ ఆధ్వర్యంలో జరగనున్న నారీ సంకల్ప దీక్షకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. భద్రత- భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి అన్ని విధాలా అండగా నిలుస్తాను' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed