మంగళగిరి వైసీపీ అభ్యర్థిపై విజయసాయి రెడ్డి క్లారిటీ

by Disha Web Desk 2 |
మంగళగిరి వైసీపీ అభ్యర్థిపై విజయసాయి రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: వారం రోజుల్లో మంగళగిరి వైసీపీ అభ్యర్థిపై క్లారిటీ ఇస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి మంగళగిరి గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పాలించే చంద్రబాబు కావాలో.. ఆంధ్రా నుంచి పాలించే జగన్ కావాలో మీరే తేల్చుకోండి అంటూ రాష్ట్ర ప్రజలకు సూచించారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తే లోకేష్‌కు మళ్లీ నిరాశ తప్పదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నిక కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు పర్మినెంట్‌గా తెలంగాణకు షిఫ్ట్ అవుతాడని ఎద్దేవా చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. అనేక స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. జనసేనకు కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరని సెటైర్ వేశారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారని జోస్యం చెప్పారు.


Next Story

Most Viewed