Vijaya saireddy: సీఐడీ విచారణకు విజయసాయి.. కాకినాడ పోర్టు కేసులో..

by Thanuru Gopichand |

కాకినాడ పోర్టు అక్రమాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలోని తాడిగడప సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Vijaya saireddy: సీఐడీ విచారణకు విజయసాయి.. కాకినాడ పోర్టు కేసులో..
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : కాకినాడ పోర్టు (Kakinada port) అక్రమాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai reddy) విజయవాడలోని తాడిగడప సీఐడీ (CID) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడు పోర్టు, కాకినాడ సెజ్​కు సంబంధించిన వాటాల బదలాయింపులో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోర్టు సెజ్​యజమానిగా ఉన్న కేవీరావు (KV Rao) ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో విక్రాంత్​రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నారు. విజయసారి రెండో నిందితుడు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే విజయసాయిని విచారించింది. సీఐడీ అధికారుల నోటీసు మేరకు ఆయన విచారణకు వచ్చారు. ఆయనతో పాటు న్యాయవాదులు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాటాల బదలాయింపులో రూ.4 కోట్ల నష్టం జరిగిందని కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతి తక్కువ ధరకు బెదిరించి ఈ వాటాలు బదలాయించారని తెలిపారు. ఇటీవల విక్రాంత్​రెడ్డి బెయిల్​పిటీషన్​ సమయంలో సీఐడీ అధికారులు కొంత సమాచారం ఇచ్చారు. ఈ వాటాలు ఎవరు ఎవరికి బదలాయించారు.. ఎంత బదలాయించారు అనే అంశాలపై విజయసాయిని విచారణ చేయనున్నట్లు సమాచారం. దీని వెనుక వైసీపీ పెద్దలు ఉన్నట్లు భావిస్తున్నారు. నగదు ఏవిధంగా చేతులు మారాయినే విషయమై ఆరా తీయనున్నారు. ఇందుకోసం కొన్ని ప్రశ్నలకు సిద్ధం చేసినట్లు సమాచారం. సీఐడీ అధికారులు తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు విచారణ చేయనున్నారు.

Next Story