- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
YS Vijayamma: జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయమ్మ
దిశ, వెబ్డెస్క్ : YS Vijayamma Speech In YSRCP Plenary Meeting| ప్లీనరీ సమావేశంలో విజయమ్మ ప్రసంగించింది. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చానంటూ ఆమె ప్రసంగం మొదలు పెట్టింది. రాజశేఖర్ రెడ్డి నావాడే కాదు.. మన, అందరివాడు అని పేర్కొంది. తాను మీకు దూరమైనా.. మీ అందరి హృదయాల్లో సజీవంగా ఉన్నారని, అందుకే ఈరోజు మీకే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతానంటూ విషెస్ తెలిపింది.
ఈ రోజు ప్లీనరీని సగర్వంగా చేసుకుంటున్నాం. ప్రజలకు ఇచ్చిన మాటకోసం జగన్ నిలబడ్డారని పేర్కొంది. జగన్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందని చెప్పుకోవడానికి గర్విస్తున్నానంది. జనం నుంచే వైఎస్ఆర్సీపీ పుట్టిందని తెలిపింది. అభివృద్ధే లక్షంగా ముందుకెళ్తున్నాం.. జగన్ జననేత అందుకే పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాడని పేర్కొంది. జగన్ లాంటి పథకాలు చంద్రబాబు ఏవైనా తీసుకొచ్చారా.. ఎన్టీఆర్ పథకాలను సైతం పక్కన పెట్టేశారని ప్రతి పక్షపార్టీని విమర్శించింది. జగన్ పై మీ అభిమానాన్ని చూసి గర్విస్తున్నాను అంది. తనను తాగు గగ్గించుకున్నవాడే హెచ్చింప బడుతాడు. బైబిల్లో ఈ వాఖ్యాన్ని నమ్మి జగన్ ముందుకు వెళ్తాన్నాడంది. అలాగే జగన్ చాలా కష్టాలు ఎదుర్కొన్నారు.. మా కుటుంబం అనేక నిందలు భరించింది, అధికారం కోసం అనేక పార్టీలు పుడుతాయి. కానీ వైసీపీ మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం పుట్టిందని తెలిపింది.