ఉపరాష్ట్రపతికి కరోనా

by Web Desk |
ఉపరాష్ట్రపతికి కరోనా
X

దిశ, ఏపీ బ్యూరో: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి కరోనా సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు. వైద్యల సూచనల మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో క్వారంటైన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. వారం రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండన్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.. ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల కృష్ణా, విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన, పలు విద్యా సంస్థల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

https://twitter.com/VPSecretariat/status/1485203893265244163?s=19


Next Story

Most Viewed