ఆ తప్పు చేయొద్దనే వైసీపీలో చేరా.... రాధాపై సోదరుడు నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
ఆ తప్పు చేయొద్దనే వైసీపీలో చేరా.... రాధాపై సోదరుడు నరేంద్ర సంచలన  వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల నుంచి వచ్చిన మనిషిగా రంగాకు ఇంకా పేరు ఉంది. రంగా ఉంటే ప్రస్తుత రాజకీయాలు వేరేలా ఉంటాయని సీనియర్ నాయకులు అంటుంటున్నారు. అలాంటి రంగాను చంపేశారు. దీంతో టీడీపీ నాయకులే చంపించారని ఇప్పటికీ ప్రత్యర్థి నాయకులు ఆరోపిస్తూనే ఉంటారు. అయితే అవేమీ పట్టించుకోకుండా రంగా తనయుడు రాధా మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు టికెట్ రాకున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో వంగవీటి రంగా మరో తనయుడు నరేంద్ర విమర్శలు చేస్తున్నారు. వంగవీటి రాధా చేసిన తప్పు చేయకూడదనే తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. తన తండ్రి రంగాను హత్య చేసింది టీడీపీ వాళ్లేనని ఆరోపించారు. అలాంటి టీడీపీతో తాము ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు. వంగవీటి కుటుంబం ఎప్పటికీ ప్రజల పక్షమేనన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనైతికమని చెప్పారు. పవన్ వెంట కాపులు ఎవరూ ఉండరని చెప్పారు. తాను పదవుల కోసం వైసీపీలో చేరలేదని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.

Read More..

YS Sharmila: లోక్‌సభ ఎన్నికల బరిలోకి వైఎస్ షర్మిల.. పోటీ ఆ స్థానం నుంచే?

Next Story