Rajyasbha: గోదావరి జలాలు కాలుష్యరహితం

by Disha Web Desk 16 |
Rajyasbha: గోదావరి జలాలు కాలుష్యరహితం
X

దిశ, ఏపీ బ్యూరో: గోదావరి నదీ జలాల్లో కాలుష్యం లేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. దేశంలోని కలుషిత నదీ భాగాలను గుర్తిస్తూ 2018 సెప్టెంబర్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన నివేదిక ప్రకారం రాయనపేట నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదీ జలాలు కలుషితం అయినట్లు గుర్తించినప్పటికీ నవంబర్ 2022 సీపీసీబి నివేదికలో ఆ జాబితా నుంచి గోదావరిని తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాజమండ్రి వద్ద గోదావరి జలాల్లో కాలుష్య నిర్మూలన, నదీ జలాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ పథకం కింద 110.22 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు



Next Story

Most Viewed