- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మృతదేహాన్ని తరలిస్తుండగా అనుకోని ప్రమాదం.. అల్లాడిపోతున్న బాధితులు

X
దిశ, వెబ్ డెస్క్: మృతదేహాన్ని తరలింపు అనుకోని ప్రమాదాన్ని తీసుకొచ్చింది. దీంతో భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా(Guntur) తాడికొండ మండలం కంతేరు(Kanteru)కు చెందిన వ్యక్తి శుక్రవారం మృతి చెందారు. ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్తూ బాణా సంచా కాల్చారు. అయితే ఈ నిప్పురవ్వలు పక్కనే ఉన్న పొగాకు బ్యారన్పై పడ్డాయి. వెంటనే బ్యారన్ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఆరబెట్టిన పొగాకు కట్టలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తి చావు కారణంగా తమ బ్యారన్ బూడిదై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు బ్యారన్కు అంటుకున్న మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.. ఘటనపై కేసు నమోదు చేశారు.
Next Story