Kalleru: నదిలో స్నానానికి ఇద్దరు యువకులు గల్లంతు.. గాలింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-20 16:59:23  IST  )

సీలేరు నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు...

Kalleru: నదిలో స్నానానికి ఇద్దరు యువకులు గల్లంతు.. గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: సీలేరు నది(Seeleru river)లో ఇద్దరు యువకులు(Two Youths) గల్లంతయ్యారు. స్నానం చేసేందుకు వెళ్లిన శ్రీను, దిలీప్ కొద్దిసేపటికే నీటి కొట్టుకుపోయారు. దీంతో వారిద్దరి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు ఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో యువకులు శ్రీను, దిలీప్ స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు కూడా నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే బాధిత కుటుంబాలకు సమాచారం అందజేశారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story