Madanapalle: భర్త కోసం ఇద్దరు భార్యల గొడవ.. ఆత్మహత్యాయత్నం..!

by Vemula.Srinu Prasad |

Two wifes tried to commit suicide after quarreling over their husbands

Madanapalle: భర్త కోసం ఇద్దరు భార్యల గొడవ.. ఆత్మహత్యాయత్నం..!
X

దివ, వెబ్ డెస్క్: భర్త కోసం గొడవపడి ఇద్దరు భార్యలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె చంద్రకాలనీలో జరిగింది. స్థానిక టమాటా మార్కెట్‌లో పని చేసే రెడ్డి శేఖర్.. దుర్గమ్మ, లక్ష్మీ అనే ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయం ఇద్దరి భార్యలకు తెలిసింది. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. భర్త రెడ్డి శేఖర్ తమకే కావాలంటూ పరస్పరం ఘర్షణకు దిగారు. చివరకు ఇద్దరూ పురుగులు మందు తాగారు. స్థానికులు గమనించి దుర్గమ్మ, లక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Next Story