- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి.. ఒకరికి సీరియస్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: శ్రీకాకులం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జీడితోటలో ముగ్గురిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు లైశెట్టి కుమార్, లోకనాథంగా గుర్తించారు. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఈ దాడి జరిగింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే స్థానికులు, వాహనదారులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఒంటరిగా వెళ్లొద్దని, వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story