ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి.. ఒకరికి సీరియస్

by Disha Web Desk 2 |
ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి.. ఒకరికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జీడితోటలో ముగ్గురిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు లైశెట్టి కుమార్, లోకనాథంగా గుర్తించారు. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఈ దాడి జరిగింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ మార్గంలో వెళ్లే స్థానికులు, వాహ‌న‌దారుల‌ను పోలీసులు అప్రమ‌త్తం చేశారు. ఒంట‌రిగా వెళ్లొద్దని, వన్యప్రాణుల ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉండాల‌ని పోలీసులు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed