Heavy Rains: కృష్ణా నదిలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం వద్ద కృష్ణా నదిలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు...

Heavy Rains: కృష్ణా నదిలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur) వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rains) కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఉద్దండరాయునిపాలెం(Uddandarayunipalam)లో వరద ఉధృతి పెరిగింది. దీంతో కృష్ణా నది(Krishna river)లో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం.. గల్లంతైన వారు కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. వారి కోసం కృష్ణా నదిలో గాలిస్తున్నారు.

Next Story