- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD: రూ.100 కోట్లు దాటిన టీటీడీ నెల ఆదాయం
by Thanuru Gopichand |
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి నెల ఆదాయం వంద కోట్ల రూపాయలను దాటింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి (titumala tirupathi devastanam) నెల ఆదాయం వంద కోట్ల రూపాయలను (100 crores) దాటింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రోజూ తిరుమల కొండపైకి తండోపతండాలుగా తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో దేవస్థానం హుండీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆదాయాన్ని బోర్డు వెల్లడించింది. ఈ నెలలో ఆదాయం రూ.100.69 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. టీటీడీ (ttd) ఆదాయం ఏటికేడాది పెరుగుతూ వస్తోంది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
Next Story






