TTD News : వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

తిరుమల(Tirumala)లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ(TTD) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

TTD News : వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ(TTD) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. వేసవిలో పెరగనున్న భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేస్తున్నట్టు బోర్డు తెలిపింది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. భక్తుల రద్దీ అధికంగా ఉండనుండటంతో కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే ఈ దర్శనాలు ఉంటాయని స్పస్టం చేసింది. ఈ ఉత్తర్వులు మే 1 నుంచి జులై 15 వరకు అమలులో ఉంటాయని టీటీడీ తెలియ జేసింది.

Next Story