ఘోర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్య!

by Malleboina Mahesh |

ఘోర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్య!
X

దిశ, వెబ్ డెస్క్: ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరిని షాక్ కు గురి చేసింది. ఈ విషాద సంఘటన కృష్ణా జిల్లా గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒకసారి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సామూహిక ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలుగా తెలుస్తుంది. ఈ సమాచారం అందున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Next Story