- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:భక్తులకు TTD అలర్ట్.. తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం?
by Jakkula.Mamatha |
తిరుమల(Tirumala News) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

X
దిశ,వెబ్డెస్క్: తిరుమల(Tirumala News) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో నిన్న(గురువారం) దీపావళి(Diwali) సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తాజాగా టీటీడీ(TTD) కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే.. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన వస్త్రాలను టీటీడీ వేలం వేస్తోంది. నవంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్ వేలంలో వీటిని దక్కించుకోవచ్చు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నట్లు టీటీడీ తెలిపింది. పూర్తి వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెట్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్నుwww.tirumala.org , www.konugolu.ap.govt.in సంప్రదించాలని తెలిపింది.
Next Story






