Andhra Pradesh : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

by Muthe.Rajitha |

ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

Andhra Pradesh : ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(Neerab Kumar Prasad) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. చెరుకూరి శ్రీధర్‌ను వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. జి లక్ష్మీషాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. అభిషిక్త కిషోర్‌కు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా అదరపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు వహించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు. వి సి&ఎండీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సీఈవో పోస్టులకు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇన్‌చార్జిలను నియమించాలని వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.

Next Story