- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ - దువ్వాడ మధ్య రైళ్లు రద్దు
by Naga Rani Yarlagadda |
దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. విజయవాడ - దువ్వాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

X
దిశ, వెబ్డెస్క్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. విజయవాడ - దువ్వాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ పోర్టు - విశాఖపట్నం (17267), విశాఖ - కాకినాడ పోర్టు (17268), రాజమండ్రి - విశాఖ (67285), విశాఖ - రాజమండ్రి (67286) రైళ్లను ఈ నెల 20న రద్దు చేసినట్లు తెలిపారు. కాగా.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 12న నర్సాపూర్ - సికింద్రాబాద్, 15న అనకాపల్లి - సికింద్రాబాద్ కు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Next Story






