పండగపూట విషాదం.. వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది మృతి

by Vemula.Srinu Prasad |

పండగపూట రాష్ట్రంలో పలుచోట్ల విషాదఛాయలు అలుముకున్నారు.

పండగపూట విషాదం.. వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పండగపూట రాష్ట్రంలో పలుచోట్ల విషాదఛాయలు అలుముకున్నారు. వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా తాగిపూడి దగ్గర గోదావరిలో గల్లంతై ఐదుగురు యువకులు మృతి చెందారు. ఏలూరు జిల్లా తమ్మిలేరులో ఈతకు వెళ్లిన ఇద్దరు సైతం మృత్యువాత పడ్డారు. అలు నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం దగ్గర స్నానం చేస్తూ తండ్రీకొడుకులు మృతి చెందారు. నెల్లూరులో టెన్త్ విద్యార్థి కాలువలో ఈతకు దిగి నీటిలో గల్లంతై కన్నుమూశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శివరాత్రి వేళ శోకసంద్రంలో మునిగిపోయారు.

Next Story