Tiruvuru: తిరువూరు నగర పంచాయతీ.. టీడీపీ కైవసం

by Thanuru Gopichand |   (  Updated:2025-06-02 07:19:00  IST  )

తిరువూరు నగర పంచాయతీ చైర్​పర్సన్​పదవి టీడీపీ కైవసం అయింది. చైర్​పర్సన్​గా కొలికపోగు నిర్మల ఎన్నియ్యారు.

Tiruvuru: తిరువూరు నగర పంచాయతీ.. టీడీపీ కైవసం
X

దిశ, డైనమిక్​ బ్యూరో : తిరువూరు నగర పంచాయతీ చైర్​పర్సన్​పదవి టీడీపీ (TDP) కైవసం అయింది. చైర్​పర్సన్​గా కొలికపోగు నిర్మల ఎన్నియ్యారు.నిర్మలకు మద్దతుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహా 11 మంది టీడీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు. వైసీపీ తరఫున 9 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా డీఆర్వో లక్ష్మీనరసింహం వ్యవహరించారు. గతంలో కోరం లేకపోవడం తదితర కారణాలో పలుమార్లు ఎన్నిక వాయిదా పడింది. సోమవారం కో రం సరిపోవడంతో ఛైర్‌పర్సన్‌ ఎన్నికను అధికారులు నిర్వహించారు. ఈ పదవిని రిజర్వేషన్‌లో ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. వైసీపీకి (YCP) చెందిన నిర్మల గత నెల 19న ఎమ్మెల్యే సమక్షంలో తెదేపాలో చేరారు. గత నెల 19, 20 తేదీల్లో ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విడత 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ప్రశాంతంగా ఎన్నిక పూర్తయింది.

Next Story