టీటీడీకి టీడీపీ ఎంపీ తండ్రి రత్తయ్య భారీ విరాళం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-31 12:28:44  IST  )

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది..

టీటీడీకి టీడీపీ ఎంపీ తండ్రి రత్తయ్య భారీ విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో వైకుంఠ ద్వార దర్శనాలు(Vaikunta Dwara Darshans) నిర్విరీమంగా కొనసాగుతున్నాయి. ఈ డిప్ ద్వారా భక్తులకు ముందుగానే టికెట్లు కేటాయించారు. దీంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి శ్రీవారిని భక్తులు సులువుగా దర్శించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భారీగా తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరించిపోతున్నారు. అలాగే కానుకలు సైతం భారీగా సమర్పిస్తున్నారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి, గుంటూరు విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య ఈ రోజు టీటీడీకి భారీ విరాళం అందజేశారు. టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

Next Story