- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూర్తయిన గ్రహణం.. తెరచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు
చంద్రగ్రహణం పూర్తయిన అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.

దిశ, వెబ్డెస్క్: భారత్ లో పాక్షిక చంద్రగ్రహణం పూర్తికావడంతో తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు మహాద్వారం, గర్భాలయ తలుపులను తెరిచి శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ శుద్ధి పుణ్యాహవచనం అనంతరం 8.30 గంటల నుంచీ భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకే శ్రీవారి ఆలయాన్ని మూసివేయగా.. గ్రహణం పూర్తయ్యాక రాత్రి 7.30 గంటలకు తలుపులను తెరిచారు. శ్రీవారి ఆలయంతో పాటు.. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను కూడా తెరిచి, శుద్ధి చేస్తున్నారు.
కాగా.. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. సాయంత్రం 6.47 గంటలకు పూర్తయింది. జపాన్, ఆస్ట్రేలియా దేశాల్లో సంపూర్ణంగా కనిపించిన గ్రహణం.. భారత్ లో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనువిందు చేసింది. గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపించగా.. బ్లడ్ మూన్ ను చూసిన ప్రజలు కొత్త అనుభూతి పొందామని చెప్తున్నారు.






