ముంచుకొస్తున్న తుపాను ముప్పు: రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్

by Disha Web Desk 21 |
ముంచుకొస్తున్న తుపాను ముప్పు: రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ , డైనమిక్ బ్యూరో : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 4నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమకు ఈ తుపాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇకపోతే ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నవంబరు 30 నాటికి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం డిసెంబరు 2 కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ వివరించింది. డిసెంబర్ 4న తుపానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 3న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో డిసెంబరు 2 నుంచి 4 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబరు 30 కల్లా తిరిగొచ్చేయాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.


Next Story