బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మార్పీఎస్ ఆందోళనతో రణరంగంగా మారిన తోటచర్ల..

by Disha Web Desk 12 |
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మార్పీఎస్ ఆందోళనతో రణరంగంగా మారిన తోటచర్ల..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యాప్త రోడ్ల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీంతో వారు చేపట్టిన కార్యక్రమం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జగ్గయ్యపేటలో రోడ్డుపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగగా.. అక్కడకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలోనే పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో అనేక మంది పోలీసుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి అక్కడి నుంచి తరిమి కొట్టినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed