- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్టీ కోసం కష్టపడినందుకు ఇదేనా మీరిచ్చే బహుమతి: వైసీపీ ఎమ్మెల్యేపై కౌన్సిలర్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీలోని అసమ్మతి ఒక్కొక్కటిగా బయటపడుతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆపార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైదుకూరుకు చెందిన చిలమల ఓబయ్య యాదవ్ పార్టీ పదవికి రాజీనామా చేసిన అంశం మరవకముందే మరో అసమ్మతి ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేపై కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అభివృద్దికి నిధులు కావాలని అడిగినందుకు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో శ్రమించానని అలాంటి తనపై కక్ష సాధింపు చర్యలకు దిగడం బాధాకరమన్నారు. తన వార్డు అభివృద్ధి కోసం నిధులు కావాలని అడిగినందుకు వేధిస్తారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆత్మకూరులో ఎమ్మెల్యే మద్యం షాపుల లీజులను మారుస్తున్నారని ఆరోపించారు. ఏఎస్ పేట, ఆత్మకూరులోని మద్యం షాపులకు ప్రభుత్వం కేటాయించిన లీజును తొలగించి.. ఎమ్మెల్యేకు అనుగుణంగా ఉన్నవారికి కట్టబెట్టారని కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ఆరోపించారు.