Indrakeeladri:మూడు రోజులు దుర్గాగుడి ఘాట్‌రోడ్డు మూసివేత.. కారణమిదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-03 12:36:25  IST  )

విజయవాడలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయానికి నిత్యం భారీగా భక్తులు వెళుతుంటారు.

Indrakeeladri:మూడు రోజులు దుర్గాగుడి ఘాట్‌రోడ్డు మూసివేత.. కారణమిదే!
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి ఆలయానికి నిత్యం భారీగా భక్తులు వెళుతుంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు(Devotees) తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచనలు చేశారు.

ఇంద్రకీలాద్రి ఆలయం వైపు వెళ్లే ఘాట్ రోడ్డును మూడు రోజులు మూసి వేయనున్నట్లు సమాచారం. ఈ నెల(మే) 6, 7, 8వ తేదీల్లో దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేయనున్నారు. అయితే.. కొండచరియలు పనుల్లో భాగంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో ఆంక్షాలు విధించారు. ఈ నేపథ్యంలో మరమ్మతుల దృష్ట్యా ఘాట్‌రోడ్డు మూసివేయాలని నిర్ణయించారు. ఈ తరుణంలో భక్తులు కనకదుర్గానగర్‌ మార్గం నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు. పున్నమిఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.

Next Story