ఇదే నాకు చివరి ఎన్నిక: Chandra babu Naidu సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ఇదే నాకు చివరి ఎన్నిక: Chandra babu Naidu సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. లేదంటే ఇదే నాకు చివరికి ఎన్నిక అని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ జిల్లా పత్తికొండలో నిర్వహించిన రోడ్ షాలో పాల్గొని బాబు మాట్లాడారు. అసెంబ్లీలో నన్ను, నా భార్యను అవమానించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్నది గౌరవ సభ కాదని.. కౌరవ సభ అని విమర్శలు గుప్పించారు.

మీరు గెలిపించి పంపిస్తే.. కౌరవ సభను.. మళ్లీ గౌరవ సభగా మారుస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. అసెంబ్లీలో అడుగు పెడుతానని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు కట్ చేస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తాను ఎలాంటి సంక్షేమ పథకాలు కట్ చేయను.. ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. సీఎం జగన్ మాదిరిగా అప్పులు చేయనని.. ఆదాయం పెంచుతానని పేర్కొన్నారు. ఎంపీలను కూడా అమ్ముకున్న వ్యక్తి సీఎం జగన్ అని ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed