పిడుగుపడి గొర్రెల కాపరి మృతి

by Vemula.Srinu Prasad |

మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పొలాలకు మేకలను మేపేందుకు వెళ్లిన వ్యక్తి పిడుగు పడి మృతి చెందారు...

పిడుగుపడి గొర్రెల కాపరి మృతి
X

దిశ, మాచర్ల: మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పొలాలకు మేకలను మేపేందుకు వెళ్లిన వ్యక్తి పిడుగు పడి మృతి చెందారు. మృతుడు యరనగుల చిన్న వెంకటేశ్వర్లు (55)గా గుర్తించారు. పొలాల్లో మేకలను కాస్తుండగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో వేప చెట్టు కిందకి వెంకటేశ్వర్లు వెళ్లారు. అక్కడ పిడుగు పడటంతో చిన్న వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Next Story