- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
Murali Naik: నా బిడ్డ ఇక లేడని.. ఫోన్చేసి చెప్పారు.. తన కొడుకు వీరమరణం పొందాడంటున్న తండ్రి శ్రీరాం నాయక్

దిశ, డైనమిక్ బ్యూరో : తన కొడుకు బోర్డర్లో 14 మంది పాక్ముష్కరులను మట్టుపెట్టి చివరికి తాను వీరమరణం పొందాడని మురళీనాయక్తండ్రి శ్రీరాం నాయక్తెలిపారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీనాయక్ నిన్న రాత్రి సరిహద్దుల్లో చొరబాటుదారుల కాల్పుల్లో మృతి చెందాడు. ఆయన తండ్రి శ్రీరాం నాయక్తనను కలసిన విలేకరులకు పలు విషయాలను వివరించారు. మురళీ నాయక్రెండేళ్ల కిందట ఉద్యోగంలో చేరాడని అన్నారు. 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూర్ట్మెంట్లో సెలక్ట్ అయి ఉద్యోగంలో చేరాడని తెలిపారు. అతనికి మొత్తం నాలుగేళ్ల అగ్రిమెంట్ ఉందన్నారు. ఆ అగ్రిమెంటు వచ్చే ఏడాది నవంబరుతో ముగుస్తుందన్నారు. ఇవాళ ఉదయం మిలటరీ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. తన భార్య ఫోన్ఎత్తగా ఆమెకు హిందీ అర్ధం కాలేదని, అయితే మురళి గురించి మాట్లాడుతున్నారని గమనించి తనకు ఫోన్ ఇచ్చందన్నారు.
అటునుంచి వారు రాత్రి జరిగిన కాల్పుల గురించి చెప్పారని అన్నారు. ఆ కాల్పుల్లో మురళీ నాయక్మరణించారని తెలిపారు. కాల్పుల సమయంలో 14 మంది చొరబాటుదారులను మురళీనాయక్ చంపాడని, వారిని చంపి వెనక్కు వస్తున్న సమయంలో మిగిలిన ఇంకో వ్యక్తి అటాక్చేసి అతనిని చంపాడని తెలిపారు. పంజాబ్లో అతను శిక్షణ పొండాడని, ఆర్మీ అతనిని పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కు తీసుకు వెళ్లిందని వివరించాడు. తన కుమారుడు చనిపోయేముందు పాకిస్థాన్ శత్రువులు దేశంలోకి అడుగుపెట్టుకుండా అడ్డుకుని వీరమరణం పొందాడని ఆయ గర్వంగా తెలిపారు. మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పుట్టి పెరిగారు.. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివారు. అతని మరణంతో తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు